ప్రకాశం: కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో జరుగుతున్న వైద్య శిబిరాన్ని ఎంపీడీవో ప్రభాకర్ శర్మ ఇవాళ పరిశీలించారు. జ్వరాల బారిన పడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గ్రామంలో చేపట్టిన వ్యాధుల నివారణ చర్యలను, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి జాగ్రత్త వహించాలన్నారు.