తూ.గో: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీలో భాగంగా మైనింగ్ అధికారులు రెండు రోజులు పాటు ఆత్రేయపురం మండల పరిధిలోని పలు ఇసుక రీచ్లను పరిశీలించారు. కలెక్టర్, జిల్లా మైనింగ్ అధికారి వంశీధర్ రెడ్డి ఆదేశాలు మేరకు మైనింగ్ అధికారులు రీచ్లను పరిశీలించారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని అంకంపాలెం, మెర్లపాలెం, ఇసుక రీచ్లలో ఇసుక లభ్యత గురించి పరిశీలించారు.