KRNL: కోడుమూరులో నూతనవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎస్సై ఎర్రిస్వామి వివరాల ప్రకారం.. వర్కూరుకు చెందిన శృతిని కోడుమూరుకు చెందిన నాగరాజు వివాహం చేసుకున్నాడు. చెప్పులు కొనుక్కోవడానికి భర్తను డబ్బులు అడగగా ఇవ్వలేదు. దీంతో తీవ్రమనస్తాపం చెంది వాస్మోయిల్ తాగడంతో కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.