NDL: పాణ్యం నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ప్రోత్సాహం వద్దంటూ మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో హత్యకు గురైన బోయ రమేష్ నాయుడు కుటుంబ సభ్యులతో కాటసాని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నట్లు విమర్శించారు. రమేష్ నాయుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.