KKD: సామర్లకోట మండలం ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈవో పి. పుల్లయ్య గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన మెనూను ఆయన పరిశీలించారు. ఆహార పదార్థాలను రుచి చూసి నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.