E.G: గోకవరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులలో 2025-26 నుంచి 2027-28 వరకు చేపల పెంపకం హక్కుల వేలం శుక్రవారం నిర్వహించనున్నట్లు కార్యదర్శి శిరీష గురువారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాల్వెన్సీ సర్టిఫికెట్లు, ధరావతు సొమ్ము చెల్లించి పాటదారులు వేలంలో పాల్గొనాలని ఆమె కోరారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.