అన్నమయ్య: నందలూరు, అరవపల్లిలో సూర్యఘర్ పథకంపై గురువారం మధ్యాహ్నం అవగాహన సదస్సు నిర్వహిస్తామని రాజంపేట డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందులో విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సోలార్ విద్యుత్పై ఉన్న సందేహాలను తీర్చుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.