NLR: గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆత్మకూరు DSP వేణుగోపాల్ తెలిపారు. డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా నిరంతరం దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు.