సత్యాసాయి: ధర్మవరం మండలం పోతులనాగేపల్లిలో ఆదివారం నిర్వహించిన వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని కేతిరెడ్డి పేర్కొన్నారు.