సత్యసాయి: రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ కొరతపై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గోరంట్లలోని పెట్రోల్ బంక్ వద్ద ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంధన సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. రవాణా రంగం కుదేలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.