KRNL: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిపారు.