VSP: విశాఖ కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాఠకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. స్థానిక శాఖా గ్రంథాలయ అధికారులు వర్మ, నూకరాజు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు.