KRNL: ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన 16 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,77,422 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. అనారోగ్యాలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఖర్చుల వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, పేద కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు.