E.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. నిడదవోలు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.