ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ గంగసాని లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలో మౌలిక సమస్యలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో ఛైర్మన్ ఉప్పలపాటి హరిబాబు మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులకు పిలుపునిచ్చారు.