జిల్లాలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ముద్దనూరు సీఐ నగేష్ చింతకుంట గ్రామంలో మహిళలకు అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్లైన్ నంబర్లపై వివరాలు తెలియజేస్తూ, సైబర్ నేరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శక్తి యాప్ వినియోగం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో పోలీస్ సహాయం అందుతుందన్నారు.