అన్నమయ్య: పీపీపీ విధానంపై వైసీపీ, వామపక్షాలు అవస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి మండిపడ్డారు. ఇవాళ మదనపల్లెలోని ఆయన స్వగృహం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ విధానంతో ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందన్నారు. ఈ మేరకు కూటమి అభివృద్ధి చూసి ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.