BPT: పేదల కోసం తన జీవితాన్ని అర్పించిన మహానేత వంగవీటి మోహనరంగా పేదల పెన్నిధిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల పట్టణంలోని బీమావారి పాలెంలో ఉన్న ఆయన విగ్రహానికి కోన రఘుపతి వైసీపీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.