ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని మంగ మూరురోడ్డు, సుబ్బయ్య కాలనీ, గాంధీనగర్ ఎక్స్టెన్షన్, మర్రిచెట్ల కాలనీ తదితర ప్రాంతాలకు ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు. విద్యుత్తు నిర్వహణ పనులు దృష్ట్యా ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.