VZM: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి వెల్లడించారు. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలో బుధవారం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేయాలని చెప్పారు. సేంద్రీయ ఎరువులు వాడితే దిగుబడి పెరుగుతుందని చెప్పారు. యువత వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని చెప్పారు.