ATP: ఉరవకొండ మండలంలోని లత్తవరం గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ సచివాలయం నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. గ్రామంలో ప్రభుత్వ పాలన మరింత సమర్థవంతంగా సాగనుంది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.