ప్రకాశం: తర్లుపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం వాణిజ్య గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి, ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ గదులను గాయం వెంకట రామిరెడ్డి, సీతా మహాలక్ష్మమ్మ దంపతుల గుర్తుగా వారి కుమార్తెలు నిర్మిస్తున్నారు.