ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం స్థానిక నేతలతో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాని కార్యకర్తలకు, నేతలకి సూచించారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏమైన సమస్యలు ఉంటే వాటిని నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.