కృష్ణా: గుడివాడ మండలం మోటూరులోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ విషయాలపై ఎస్సై చంటిబాబు అవగాహన కల్పించారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పోలీసు సహాయం తీసుకోవాలని సూచించారు.