SKLM: మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం అయిపోతాయని ట్రైనీ ఎస్సై కొండపల్లి ప్రమీల దేవి తెలిపారు. సోమవారం నరసన్నపేటలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నేటి తరం యువత చదువు పట్ల తగిన శ్రద్ధ చూపాలని, లేనిపోని వ్యసనాల పట్ల దృష్టి సారిస్తే జీవితాలు నిర్వీర్యం అయిపోతాయని పేర్కొన్నారు.