ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణములో ఇవాళ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల నుంచి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. అన్ని సమస్యల అర్జీలను అన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.