ప్రకాశం: పొదిలి ఆర్టీసీ డిపోలో మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శంకర్ రావు తెలిపారు. డిపో పరిధిలో సమస్యలు ఉంటే ప్రయాణికులు 99592 25700కు కాల్ చేసి తెలియపరచాలని ఆయన సూచించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.