AP: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే.