ప్రకాశం: సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట 42వ డివిజన్లోని సుందరయ్య కాలనీలో ఇవాళ ఎమ్మెల్యే బిఎన్. విజయ్ కుమార్ రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సేవ కేంద్రం ద్వారా అందిస్తున్నసేవలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ కందుకూరి బాబు, ఏఎంసీ డైరెక్టర్ కామేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.