W.G: పెంటపాడుకు చెందిన వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మర్రి సాయి కుమార్, గుండుమోగుల నాగేంద్రబాబులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పెంటపాడు పోలీసులు బుధవారం తెలిపారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈనెల 5న ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదుపై నిందితులను అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు.