KDP: పులివెందుల మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ కె.రమేష్ తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఆర్.తుమ్మలపల్లె, రాయలాపురం, రచ్చుమర్రిపల్లె గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.