GNTR: జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ఆధ్వర్యంలో న్యాయసేవాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ అదాలత్లో 2,759 కేసులు పరిష్కరించినట్లు పార్థసారథి తెలిపారు. సివిల్ 258, క్రిమినల్ 1,898, చెక్ బౌన్స్194, కార్మిక 7, వివాహ 64, బ్యాంకు 56, ప్రీ-లిటిగేషన్129 పరిష్కారమయ్యాయి అని పేర్కొన్నారు.