కోనసీమ: ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలు నుండి వినతులు స్వీకరించారు.