CTR: రాష్ట్రవ్యాప్తంగా శనివారం 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ భౌతిక శాస్త్ర పరీక్ష ముగిసింది. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షకు మొత్తం 3,461 మంది విద్యార్థులకు గాను 3,128 మంది హాజరయ్యారని, 513 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. అలాగే, ఇదే రోజు జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మరో 18 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.