GNTR: పొగాకు వినియోగించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే. విజయలక్ష్మి హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెంలో సిబార్ వైద్య విద్యార్థులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో పాల్గొన్నారు.