ATP: గుత్తి మండలం కరటికొండ సమీపంలోని 44 హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న ఆచారి అనే వ్యక్తిని కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆచారికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కారు కర్నూలు నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.