E.G: రాజమండ్రిలోని గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ మహిళా సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. “బార్” పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. ప్రజల నివాస స్థలంలో బార్కి అనుమతి ఇవ్వడం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.