కాకినాడ జిల్లాలో ఓటర్ల జాబితా ముసాయిదాను మార్చి 9న విడుదల చేయనున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. అర్హత కలిగిన వారు తమ పేర్లను పరిశీలించుకుని, తప్పులుంటే సవరించుకోవచ్చు. గ్రామ పంచాయతీల కాలపరిమితి ఏప్రిల్ 2తో గడువు ముగియనుంది.