కోనసీమ: రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి అక్కల రిశ్వంత్ రాయ్ ఛైర్మన్గా మార్చి 8న ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామచంద్రపురంలో మంత్రి సుభాశ్ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కీలక నేతలు హాజరవుతారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.