ATP: కార్తీక అమావాస్య సందర్భంగా తాడిపత్రిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామివారికి భస్మాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ఉజ్జయిని తరహాలో చేసిన ఈ అలంకరణలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.