NZB: బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు, కేటీఆర్ను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అవినీతి జరగని ‘ఫార్ములా ఈ రేస్’ విచారణకు ఏసీబీకి గవర్నర్ అనుమతి ఇవ్వడం ద్వారా, బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందన్నారు.