VZM: పదో తరగతిలో ఈ సారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు డిసెంబర్ 5వ తేదీ లోపు సిలబస్ పూర్తిచేయాలని DEO మాణిక్యం నాయుడు సూచించారు. గత ఏడాది 87% పాస్ రేట్తో రాష్ట్రంలో జిల్లా ఏడో స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్కు సిద్ధం కావాలన్నారు.