విశాఖ బీచ్ రోడ్డులో జనగణన-2027పై అవగాహన కోసం 5కే ర్యాలీ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డీఆర్వో ఎం. విశ్వేశ్వర నాయుడు, అడిషనల్ కమిషనర్ రమణమూర్తి ప్రారంభించారు. డిజిటల్ పద్ధతిలో తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతూ వేలాది మంది యువత ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.