CTR: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూను కచ్చితంగా అమలు చేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలన్నారు. ఇందులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. భోజనంపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా హెచ్ఎంలు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.