W.G: సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఒకరి ఆస్తిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఆకివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. దుంపగడపకు చెందిన భూమిని నూజివీడుకి చెందిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంతో బాధితులు PGRSలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో.. రిజిస్టర్ గతంలో కూడా ఇలాగే బంధువులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.