అన్నమయ్య: సోమవారం రాయచోటి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ప్రజాసమస్యల వేదిక అనంతరం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జున మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 10-09-2025న శివ నర్సింగ్ కాలేజ్లో జరిగే ఈ మేళాలో ఆక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ వంటి కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.