అన్నమయ్య: మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో అగ్నిమాపక అధికారి శివప్ప ఆధ్వర్యంలో శుక్రవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంటలను యంత్రాల సహాయంతో ఎలా ఆర్పాలనే దానిపై డెమో ద్వారా వివరించారు. విద్యుత్ పరికరాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.