శ్రీకాకుళం: లావేరు మండలం బుడుమూరు గ్రామంలో శనివారం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సామూహిక అభివృద్ధితో పాటు వ్యక్తిగత సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.