సత్యసాయి: హిందూపురం పట్టణంలోని 34వ వార్డు మార్కండేయ నగర్లో నూతన రోడ్డు నిర్మాణానికి కూటమి నేతలు బుధవారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో హిందూపురం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు.