PPM: కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ దొంపలపాడులో నివసిస్తున్న ఊలక సుమన్ గత రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా తమ తెల్ల రేషన్ కార్డుకు నిత్యవసర సరుకులు ఇవ్వట్లేదని వాపోతున్నాడు. డీలర్ను సంప్రదిస్తే ఎమ్మార్వో ఆఫీసు సంప్రదించాలన్నారని ఆఫీసుకు వెళ్లి సమస్యను వివరించామన్నారు.